సినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం

Update: 2019-02-18 10:15 GMT

సినిమా కథలో మలుపులాగానే సినిమా ఇండస్ట్రీ వారి జీవితంలో కూడా ఎన్నో మలుపులు వుంటాయి, మంచి సంగీత దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న్న ఆర్.పి. పట్నాయక్ గారు...ఒక సినిమా చేసారు. ఆ సినిమా వారి జీవితంలో ఒక మలుపే అని చెప్పాలి. అది శీను వాసంతి లక్ష్మి సినిమా. ఇది 2004 లో ఆర్. పి. పట్నాయక్ హీరోగా వచ్చిన ప్రయోగాత్మక చిత్రం. ఈ సినిమాకు ఆది మూలం వాసంతియుం లక్ష్మియుం పిన్నే నిజానుం అనే మలయాళ సినిమా. ఇదే సినిమా తమిళంలో కూడా విక్రం హీరోగా కాశీ అనే పేరుతో రీమేక్ చేయబడింది. ఈ సినిమాలో కథా నాయకుడు అంధుడైన ఓ గాయకుడు. ప్రస్తుతం ఆర్. పి. పట్నాయక్ గొంతు...సంగీతం మాత్రం వారి అభిమానులు మిస్ అవుతూనే వున్నారు. శ్రీ.కో. 

Similar News