కొత్త ఐ ఫోన్లు వచ్చేశాయి! ధర ఎంతో తెలుసా?
కొత్త ఐ ఫోన్లు వచ్చేశాయి. అధికారికంగా ఈ ఫోన్లను లాంచ్ చేశారు. భారత మార్కెట్లలోకి ఈ ఐ ఫోన్ లు అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి వస్తాయి.
స్మార్ట్ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త ఐఫోన్లు వచ్చేశాయ్. కాలిఫోర్నియాలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్లను కంపెనీ నీఈవో టిమ్కుక్ ఆవిష్కరించారు. తాజాగా ఈ ఫోన్ల భారత ధరలను యాపిల్ ప్రకటించింది. భారత మార్కెట్లో ఐఫోన్ 11 ధర రూ. 64,900 నుంచి ప్రారంభం కానుంది.
ఐఫోన్ 11 మొత్తం మూడు వేరియంట్లలో లభించనుంది. 64జీబీ వేరియంట్ ధర రూ. 64,800 కాగా.. 128 జీబీ వేరియంట్ ధర రూ. 69,900, 256జీబీ వేరియంట్ ధర రూ. 0,900గా నిర్ణయించింది. ఇక ఐఫోన్ 11ప్రో ధర రూ. 89,000, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,08,900గా ఉండనున్నట్లు యాపిల్ వెల్లడించింది.
అమెరికా సహా ఇతర దేశాల్లో ఈ నెల 20 నుంచి వీటి విక్రయాలు ప్రారంభమవనుండగా.. భారత్లో మాత్రం సెప్టెంబరు 2 నుంచి కొత్త ఐఫోన్లు వినియోగదారులకు అందుబాటులో రానున్నాయి.
ఫోన్లతో పాటు ఇతర గ్యాడ్జెట్లను కూడా యాపిల్ నిన్న ఆవిష్కరించింది. యాపిల్ వాచ్ సిరీన్ 5(జీపీఎన్) ధర రూ. 40,900 నుంచి, వాచ్ సిరీన్ 5(జీపీఎన్ + సెల్యూలార్) ధర రూ. 48,900 నుంచి ప్రారంభం కానుంది.