Cancer Detection: గుడ్ న్యూస్.. క్యాన్సర్ను మూడు సంవత్సరాల ముందే పసిగట్టే కొత్త టెక్నిక్!
Cancer Detection: క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో క్యాన్సర్ను గుర్తించగలిగితే చికిత్స సాధ్యమవుతుంది. కానీ, ఈ వ్యాధిని ప్రారంభ దశలో త్వరగా గుర్తించలేము. దీనివల్ల రోగులు ఎప్పుడు ఫోర్త్ స్టేజీకి చేరుకుంటారో కూడా తెలియదు.
Cancer Detection: గుడ్ న్యూస్.. క్యాన్సర్ను మూడు సంవత్సరాల ముందే పసిగట్టే కొత్త టెక్నిక్!
Cancer Detection: క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో క్యాన్సర్ను గుర్తించగలిగితే చికిత్స సాధ్యమవుతుంది. కానీ, ఈ వ్యాధిని ప్రారంభ దశలో త్వరగా గుర్తించలేము. దీనివల్ల రోగులు ఎప్పుడు ఫోర్త్ స్టేజీకి చేరుకుంటారో కూడా తెలియదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక కొత్త టెక్నాలజీని కనుగొన్నారు. దీని ద్వారా క్యాన్సర్ లక్షణాలు కనిపించడానికి దాదాపు మూడేళ్ల ముందే దానిని గుర్తించవచ్చు. ఈ పరిశోధన అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో జరిగింది. యూనివర్సిటీ శాస్త్రవేత్తలు క్యాన్సర్ను 36 నెలల ముందుగానే గుర్తించవచ్చని పేర్కొన్నారు. దీనివల్ల క్యాన్సర్ రోగులకు చికిత్స అందించడం సులభతరం అవుతుంది. వ్యాధిని ముందుగానే గుర్తించడం ద్వారా ప్రారంభ దశలోనే నయం చేయవచ్చు. ప్రస్తుతం ఈ పరిశోధన ప్రారంభ దశలో ఉన్నప్పటికీ ఇది క్యాన్సర్ నివారణలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
ఈ పరిశోధన ప్రతిష్టాత్మక వైద్య పత్రిక క్యాన్సర్ డిస్కవరీలో ప్రచురితమైంది. రక్తంలో ఉండే జీన్లలో జరిగిన మార్పులను గుర్తించే ఒక పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారని ఇందులో పేర్కొన్నారు. ఇది భవిష్యత్తులో ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందో లేదో చెప్పగలదు. ఈ టెక్నాలజీని మల్టీ-క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్(MCED) టెస్ట్ అని పిలుస్తున్నారు.
ఎంసీఈడీ టెస్ట్ ఒక రకమైన ఎక్స్పెరిమెంటల్ బ్లడ్ టెస్ట్. ఇందులో రక్తంలో ఉండే డీఎన్ఏ, ఆర్ఎన్ఏ లేదా ప్రోటీన్ల ద్వారా శరీరంలో ఏదైనా రకమైన క్యాన్సర్ సంకేతాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. ఈ టెస్ట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది సాంప్రదాయిక పరీక్షల ద్వారా సాధ్యం కాని అనేక రకాల క్యాన్సర్లను ఒకేసారి గుర్తించగలదు.
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు 52 మంది రక్త నమూనాలను పరీక్షించారు. వీరిలో 26 మందికి ఆరు నెలల్లోపు క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. 26 మంది ఆరోగ్యంగా ఉన్నారు. పరిశోధనలో 8 మందికి టెస్ట్ పాజిటివ్ వచ్చిందని, వారికి 4 నెలల్లోపే క్యాన్సర్ నిర్ధారణ అయిందని తేలింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఎనిమిది మందిలో ఆరుగురి పాత రక్త నమూనాలను (సుమారు 3.1 నుండి 3.5 సంవత్సరాల క్రితం సేకరించినవి) కూడా పరీక్షించారు. వీటిలో నాలుగు నమూనాలలో క్యాన్సర్కు సంబంధించిన జెనెటిక్ మ్యుటేషన్ అంటే జీన్లలో మార్పులు ముందుగానే ఉన్నట్లు గుర్తించారు.
ఈ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త ప్రకారం.. ఈ ఫలితాలు శాస్త్రవేత్తలకు కూడా ఆశ్చర్యం కలిగించాయి. క్యాన్సర్ను మూడు సంవత్సరాల ముందే గుర్తించగలిగితే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే పట్టుకోవచ్చు. దీనివల్ల చికిత్సకు అవకాశం, విజయం రెండూ పెరుగుతాయి. కానీ ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో దీనిని మరింత సులభతరం చేయవచ్చని ఆశిస్తున్నారు.