వైఎస్ వివేకానంద రెడ్డికి కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యమని అతని కుమార్తె సునీత అన్నారు. కుటుంబంలో విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం అసత్యం అన్న సునీత నాన్న చనిపోయిన తర్వాత వస్తున్న వార్తలు బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణ సక్రమంగా జరగాలని కోరుకుంటునట్లు ఆమె పేర్కొన్నారు. ఇక జగన్ అన్న సీఎం కావడం నాన్న కల అని సునీత తెలిపారు. రాజకీయ నాయకులకు, మీడియాకు తనది ఒకటే విన్నపమని, తన తండ్రి ఇప్పటికీ బ్రతికి ఉంటే ఎలాంటి గౌరవం చూపుతారో... ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరించాలని ఆమె అభ్యర్థించారు.