రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తులుండవని తేల్చేశారు వైసీపీ అధినేత జగన్. అన్న పిలుపు కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని క్లారిటీ ఇచ్చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదన్న జగన్ హంగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వైసీపీ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆరోపించారు.