స్కూబా డైవింగ్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. అండమాన్ దీవుల్లో...

Vijayasai Reddy: సముద్రం గర్భంలో లోతైన జీవితం అద్భుతంగా ఉంది : విజయసాయిరెడ్డి

Update: 2022-01-07 06:56 GMT

స్కూబా డైవింగ్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. అండమాన్ దీవుల్లో...

Vijayasai Reddy: ఎప్పుడూ పొలిటికల్‌గా బిజీగా ఉండే ఎంపీ విజయసాయిరెడ్డి.. సడన్‌గా సముద్ర గర్భంలో ప్రత్యేక్షమయ్యారు. సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ సాగరతీర అందాలను అస్వాదించారు. మొన్నటి వరకు ఢిల్లీలో జగన్‌తో బిజీగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు అండమాన్‌ దీవుల్లో కనిపించారు. సముద్రంలో అందమైన జీవితం మాయాజాలంతో తాను ఆశ్చర్యపోయానని విజయసాయిరెడ్డి ట్విట్‌లో వెల్లడించారు. అండమాన్ సముద్రంలో 12 మీటర్ల లోతైన నీటిలో స్కూబా డైవింగ్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. లోతైన జీవితాన్ని చూడటం పూర్తిగా అద్భుతంగా ఉందని చెప్పారు.


Tags:    

Similar News