ఒత్తిడితో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేయరాదు
ఒత్తిడితో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేయరాదని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి.
ఒత్తిడితో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేయరాదని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికల ఖర్చు ఎక్కువ చూపితే కఠిన చర్యలు తప్పవన్నారు. గ్రామ పంచాయతీకి సంబంధించి కొత్త పథకాలు చేపట్టరాదన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై సాధారణ, వ్యయ పరిశీలకులతో నాగిరెడ్డి సమావేశమయ్యారు. కొత్త పంచాయతీ చట్టం, ఎన్నికల విధులు, విధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు.