ఆమంచి పార్టీ మార్పుపై వీడని సస్పెన్స్

Update: 2019-02-07 05:52 GMT

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న చంద్రబాబుతో భేటీ కోసం ప్రయత్నించి కుదరకపోవడంతో ఇవాళ మరోసారి సీఎంతో సమావేశం కోసం ప్రయత్నిస్తున్నారు. కాసేపట్లో ఆమంచి కృష్ణమోహన్ అమరావతిలో చంద్రబాబుతో భేటీ కానున్నట్లు సమాచారం. చీరాల నుంచి అసెంబ్లకి ప్రతినిధ్యం వహిస్తున్న ఆమంచి.. టీడీపీని వీడతారంటూ..కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు ఆమంచి కృష్ణమోహన్ .. చంద్రబాబుతో భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Similar News