తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కలిగించిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ముగ్గురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు, చిన్నాన్న శ్రవణ్కుమార్, మరో నిందితుడు ఖరీంలపై నల్లగొండ పోలీసులు విధించిన పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయస్ధానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న ముగ్గురు నిందితులు నేడు లేదంటే సోమవారం విడుదల కానున్నారు.