వైసీపీలో వలసలు పెరిగిపోతున్నాయి. టీడీపీ ఎంపీ తోట నర్సింహం కుటుంబ సభ్యులతో పాటు విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు దంపతులు, పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ , సినీ నటుడు రాజా రవీంద్ర లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. మరోవైపు వైసీపీ మొదటి లిస్టును జగన్ ఈరోజు విడుదల చేయనున్నారు.