మహబూబ్నగర్లోని పద్మావతి కాలనీలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఆరుగురు గాయపడ్డారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ టీ కొట్టులో రెండు సిలిండర్లు పేలాయి. ఈ ఉదయం మున్సిపల్ సిబ్బంది టీకొట్టు దగ్గర్లోనే చెత్తకు నిప్పంటించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డబ్బా యజమానితో పాటు ఐదుగురు మున్సిపల్ సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న కారు అద్దాలు సైతం ధ్వంసం అయ్యాయి. సిలిండర్ లీకేజీ వల్లే పేలుడు జరిగిందని స్థానికులు చెబుతున్నారు.