పెండింగ్ సీట్లపై సీఎం చంద్రబాబు ఫోకస్...కాసేపట్లో....

Update: 2019-03-13 07:52 GMT

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెండింగ్ సీట్లపై ఫోకస్ పెట్టారు. కాసేపట్లో 20 నుండి 30 పెండింగ్ స్థానాల నేతలతో చంద్రబాబు, సమన్వయ కమిటీ భేటీ కానుంది. చిత్తూరు జిల్లా సత్యవేడు, శ్రీకాళహస్తిపై నేడు కీలక సమావేశం జరుగనుంది. సీఎం సొంత జిల్లా కావడంతో బాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా తలారి ఆదిత్య ఉండగా అక్కడి నుంచి జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె రేసులో ఉన్నారు. సుజనా చౌదరి, యనమల కమిటీ సత్యవేడు నేతల అభిప్రాయం తెలుసుకోనుంది. ఇక శ్రీకాళహస్తి టికెట్‌ను ఎస్.వి.నాయుడు, బొజ్జల సుధీర్ ఆశిస్తున్నారు. 

Similar News