జగన్ , షర్మిల వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటే ఈ రాష్ట్ర పౌరులుగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇక్కడ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారన్నారు. విశాఖలో జగన్పై దాడి జరిగితే హైదరాబాద్ వెళ్లి ఎన్ఐఏ విచారణ కావాలంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కోడి కత్తి కేసును ఎన్ఐఏకి ఇవ్వడంపై కోర్టుకు వెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కేసీఆర్, మోదీ, జగన్ ఏకమైనా జనం అభిప్రాయం మార్చలేరన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో అభివృద్ధిని అడుకోలేరన్నారు.