ఆయన బహిరంగంగా క్షమాపణ చెబితే వదిలేస్తా: జీవీఎల్‌

Update: 2019-02-06 10:43 GMT

టీడీపీ నాయకులు హద్దు మీరి మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో తనను బెదిరించిన బుద్ధ వెంకన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. బుద్ధా వెంకన్న తనకు బహిరంగంగా క్షమాపణ చెప్తేనే ఈ విషయాన్ని వదిలేస్తామన్నారు. ఇక టీడీపీ నేతలు చేసిన తప్పుడు పనులను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసుని అన్నారు. బీజేపీ నాయకులను, కార్యకర్తలను బెదిరిస్తున్న విషయం హోమ్‌ మంత్రికి తెలియచేశామన్నారు జీవీఎల్‌.



Similar News