మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్. జగన్ అని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కొనియాడారు. ఏలూరు బీసీ గర్జన సభకు హాజరైన కృష్ణయ్య దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీసీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్లే లక్షలాది మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత హోదాల్లో ఉన్నారని ప్రశంసించారు.