ఎన్డీయేతర పక్షాలను ఏకం చేసే దిశగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు బలమైన పార్టీలను ఒకే తాటిపైకి వచ్చిన క్రమంలో మరిన్ని పార్టీలను చేర్చే దిశగా ఢిల్లీ బాట పట్టారు. వచ్చే నెల ఒకటిన ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్న చంద్రబాబు ఎన్డీయేతర పక్షాలతో చర్చలు జరపనున్నారు. ఇదే సమయంలో ఈవీఎంల పనితీరుపై చర్చించనున్నారు. ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు కోల్కతా తరహాలో రాష్ట్రాల వారిగా భారీ బహిరంగ సభల ఏర్పాటుపై కూడా చర్చించే అవకాశాలున్నాయి.