UK New Visa Rules: అమెరికా బాటలోనే యూకే- వీసా రూల్స్ కఠినతరం... భారతీయులపై ప్రభావం

UK New Visa Rules Foreign Workers: వలస విధానాల్లో కఠినత్వాన్ని అవలంబిస్తూ యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) కీలక అడుగు వేసింది. అమెరికా తరహాలోనే విదేశీ నిపుణుల వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టింది.

Update: 2025-07-02 02:30 GMT

UK New Visa Rules: అమెరికా బాటలోనే యూకే- వీసా రూల్స్ కఠినతరం... భారతీయులపై ప్రభావం

UK New Visa Rules Foreign Workers: వలస విధానాల్లో కఠినత్వాన్ని అవలంబిస్తూ యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) కీలక అడుగు వేసింది. అమెరికా తరహాలోనే విదేశీ నిపుణుల వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త వీసా నిబంధనలను జూలై 22 నుంచి అమలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి.

వలసలపై నియంత్రణ అవసరమే: హోం మంత్రి స్పష్టం

యూకే హోం మంత్రి యెవెట్ కూపర్ మాట్లాడుతూ, “వలస విధానాన్ని పూర్తిగా పునర్ వ్యవస్థీకరించేందుకు ఇదే సరైన సమయం. గత నాలుగేళ్లలో వలసల తీవ్రత నాలుగు రెట్లు పెరిగింది. దేశీయ ప్రజలకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేపడుతున్నాం,” అని తెలిపారు. శ్రమదోపిడీ లేకుండా సరైన నైపుణ్యాలతో సేవలందించే విదేశీయులకే వీసా మంజూరవుతుందని స్పష్టం చేశారు.

భారతీయులపై ప్రభావం తీవ్రమే

యూకేలో పర్సనల్ కేర్, హోటల్స్, నిర్మాణ రంగం, ఆస్పత్రులు వంటి దిగువ స్థాయి ఉద్యోగాల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేస్తుంటారు. అయితే కొత్త వీసా నిబంధనలతో వీరిపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా బిచ్చగాళ్లు, వంటమనుషులు, ప్లాస్టరింగ్ వర్కర్లు వంటి వృత్తులకు మినహాయింపులు ఇకపై ఉండవు.

నూతన వీసా నిబంధనలు ఇలా ఉండనున్నాయి:

♦ యూకేలో ఉద్యోగం చేయాలంటే విదేశీ నిపుణులకు అదనపు నైపుణ్యాలు తప్పనిసరి

♦ కంపెనీలు విదేశీ నిపుణులకు ఇచ్చే న్యూనత వేతనాన్ని పెంచాలి

♦ గ్రాడ్యుయేట్‌ స్థాయి కంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు విదేశీయులతో భర్తీ చేయకూడదు

♦ ఇంటి పనులు, పర్సనల్ కేర్, వృద్ధులు, పిల్లలు, దివ్యాంగుల సేవలకు విదేశీయులను నియమించరాదు

♦ 100కుపైగా తాత్కాలిక వృత్తులకు వీసా మినహాయింపులు ఇక ఉండవు

ఇప్పటికే ఉన్న వలసదారులకు మినహాయింపులు

యూకే వలస శాఖ సహాయ మంత్రి సీమా మల్హోత్రా ప్రకారం, ఇప్పటికే యూకేలో ఉన్న విదేశీ కార్మికులకు కొత్త నిబంధనల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి. జూలై 22 నుంచి కనీసం బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హత కలిగినవారికే వీసా దరఖాస్తు చేసే అర్హత ఉంటుంది. సోషల్ కేర్ ఉద్యోగాలను ఇకపై విదేశీయులతో భర్తీ చేయరాదని, మరోవైపు ప్రస్తుతం ఉన్న వారు 2028 జులై వరకు ఉద్యోగం మారించుకునే వెసులుబాటు పొందుతారని చెప్పారు.

తాత్కాలిక కొరత వృత్తులపై ప్రభావం

మునుపటి ప్రభుత్వాలు వంట పనులు, ప్లాస్టరింగ్ వృత్తులను తాత్కాలిక కొరత జాబితాలో చేర్చిన నేపథ్యంలో, ఆ ఉద్యోగాల్లో పని చేసే విదేశీయులకు వీసా మినహాయింపులు అందించేవి. ఇప్పుడు ఆ సౌకర్యాలు తొలగిపోతున్నాయి. ఇకపై వారికి వీసా ఫీజు రాయితీలు కూడా ఉండవు.

ఇంకా కఠినతర నిబంధనలు వచ్చే అవకాశముంది

2026 డిసెంబర్ వరకు ప్రస్తుత తాత్కాలిక కొరత జాబితా అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపినా… ఇందులో మార్పులపై మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ సిఫారసుల ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది. అంతేకాక, ఇంగ్లీష్ భాష నైపుణ్యాలపై మరింత కఠినతర ప్రమాణాలు తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా ప్రస్తుతం పరిశీలనలో ఉంది.

Tags:    

Similar News