అంతరిక్షయానంలో చారిత్రక ఘట్టం.. ఓ ప్రైవేటు వ్యోమనౌకలో నింగిలోకి వ్యోమగాములు
అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఓ ప్రైవేటు సంస్థకు చెందిన అంతరిక్షనౌకలో వ్యోమగాములు రోదసీలోకి వెళ్లారు.
అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఓ ప్రైవేటు సంస్థకు చెందిన అంతరిక్షనౌకలో వ్యోమగాములు రోదసీలోకి వెళ్లారు. వ్యోమగాములు అమెరికా గడ్డపై తొమ్మిదేళ్ల తర్వాత నుంచి ఐఎస్ఎస్కు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ ప్రయోగంపై అందరిలోను ఆసక్తి నెలకొంది. నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్ స్టేషన్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 3:22 గంటలకు మానవ సహిత 'క్రూ డ్రాగన్' క్యాప్సూల్ను మోసుకెళ్లిన ఫాల్కన్-9 రాకెట్ నిప్పులు చిమ్ముతూ వెళ్ళింది.
రాకెట్ ద్వారా డగ్లస్ హర్లీ , రాబర్ట్ బెంకెన్ అంతరిక్షంలోకి ప్రయాణమయ్యారు. దాదాపు 19 గంటల ప్రయాణం తర్వాత వీరు ఐఎస్ఎస్కు చేరుకోనున్నారు. రష్యా వ్యోమగాములు అనాటోలీ ఇవానిషిన్, ఇవాన్ వాగ్నెర్, అమెరికా వ్యోమగామి క్రిస్ కాసిడీలను కలుసుకోనున్నారు. వాస్తవానికి బుధవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి నిమిషాల్లో వాయిదా పడిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలువురు అధికారులతో కలిసి వీక్షించారు. ఈ సంధర్భంగా 'ఇది చాలా ప్రత్యేకమైనది. ఇవాళ అమెరికా గడ్డపై నుంచి, అమెరికన్ రాకెట్లలో, అమెరికా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాం' అని ట్రంప్ పేర్కొన్నారు.
Liftoff! pic.twitter.com/DRBfdUM7JA
— SpaceX (@SpaceX) May 30, 2020
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి