PM Modi: ఈజిప్టులో తొలిసారి పర్యటించబోతున్న మోడీ

PM Modi: 1997 తర్వాత ఈజిప్టులో పర్యటిస్తున్న తొలి ప్రధాని నరేంద్ర మోడీ

Update: 2023-06-24 04:18 GMT

PM Modi: ఈజిప్టులో తొలిసారి పర్యటించబోతున్న మోడీ

PM Modi: ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగించుకొని ఈజిప్టుకు బయల్దేరారు. చారిత్రక అమెరికా పర్యటనలో అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక చర్చలు, ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తల సమావేశాలతో మూడు రోజుల పాటు బిజీబిజీగా గడిపారు ప్రధాని. బైడెన్ దంపతులు ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ఇచ్చిన విందుతో అమెరికా పర్యటన ముగించుకొని విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాన మోడీ ఈజిప్టు బయల్దేరారు.

కాగా ప్రధాని మోడీ ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. 1997 తర్వాత ఈజిప్టులో పర్యటిస్తున్న తొలి ప్రధాని నరేంద్ర మోడీ. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతేహ్ ఎల్ సీసీ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఈజిప్టులో పర్యటిస్తున్నారు.

Tags:    

Similar News