చైనాలో ఇరుక్కుపోయిన పాక్ పౌరులు.. రక్షించలేమని చేతులెత్తేసిన పాకిస్థాన్
-తమ పౌరులను కాపాడేందుకు వేగంగా స్పందిస్తున్న పలు దేశాలు -చైనాలో తమ పౌరులను రక్షించలేమని చేతులెత్తేసిన పాకిస్థాన్
చైనాలో ప్రాణంతక కరోనా వైరస్ విజృంభి వందలాది మందిని కబలించింది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు ఆయా ప్రభుత్వాలు వేగంగా స్పందిస్తున్నాయి. పాకిస్తాన్ మాత్రం దీనికి విరుద్ధంగా చైనాలోని తమ పౌరులను రక్షించలేమని చేతులెత్తేసింది. తమ దేశంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేవని, కరోనాను తట్టుకునేంత ఆర్థిక స్తోమత కూడా లేదని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చైనాలో ఏర్పాటు చేసిన నిర్బంధ కేంద్రాల్లోనే పాక్ పౌరులు ఉండాల్సి వచ్చింది. మరోవైపు తమ దేశ పౌరులను కాపాడాల్సిందిగా పాక్ ప్రభుత్వం చైనాను వేడుకుంటోంది.