Coronavirus: బ్రిటన్ ప్రధాని బోరిస్ ఆరోగ్యం విషమం
కరోనా మహమ్మారి అన్ని దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే దీని బారిన పడి 70 వేల మందిపైగా మరణించారు.
కరోనా మహమ్మారి అన్ని దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే దీని బారిన పడి 70 వేల మందిపైగా మరణించారు. ఒక్క యూరప్లోనే 50,135 మంది మృత్యువాతపడ్డారు. ఇటలీ 15,877 మంది చిపోయారు. 13,055 మరణాలతో స్పెయిన్, 8,078 మరణాలతో ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక జర్మనీ కూడా లక్ష పాజిటివ్ కేసుల జాబితాలో చేరిపోయింది.
మరోవైపు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా తయారైంది. కరోనా లక్షణాలు తీవ్రం కావడంతో ఆయన్ను ఐసీయూకు తరలించారు. లండన్లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బోరిస్ ఆదివారం సాయంత్రం నుంచి మరింత వ్యాధి తీవ్రత మరింత ఎక్కువుతోంది. దీంతో వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్కు తరలించామని ప్రధాని విదేశాంగ సెక్రటరీ డొమినిక్ రాబ్ తెలిపారు.
బోరిస్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. బోరిస్కు మంచి వైద్యం అందించేలా డాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. తనకు బోరిస్ మంచి మిత్రుడని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేసుకున్నారు. అటు.. బ్రిటన్లో సోమవారం 439 మంది మృతి చెందారు. దీంతో మరణాలు 5,372కి చేరాయి. ఒక్కరోజులోనే స్పెయిన్లో 634, ఇటలీలో 635 మంది చనిపోయారు.