బ్రహ్మోస్ భయంతో బిక్కబిక్కలాడిన పాక్: చైనా రక్షణ వ్యవస్థకు గుడ్బై చెప్పి జర్మనీ వైపు చూపు!
ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత బ్రహ్మోస్ భయంతో పాక్ గగనతల రక్షణ వ్యవస్థ మార్పు contemplation లోకి వచ్చింది. HQ-9 ఫెయిల్ కావడంతో జర్మన్ IRIS-T వ్యవస్థపై దృష్టి సారించింది.
బ్రహ్మోస్ భయంతో బిక్కబిక్కలాడిన పాక్: చైనా రక్షణ వ్యవస్థకు గుడ్బై చెప్పి జర్మనీ వైపు చూపు!
ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తరువాత పాకిస్థాన్ (Pakistan) భయంతో ఊగిపోతోంది. భారత సైన్యం వినియోగించిన అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులు (BrahMos Missiles) పాక్ వైమానిక స్థావరాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపినట్లు అక్కడి ప్రభుత్వమే ప్రకటించడంతో... పాక్ ప్రస్తుతం తలపట్టుకుంది.
చైనా రక్షణ వ్యవస్థకు నో చెప్పిన పాక్
ఇప్పటి వరకు పాకిస్థాన్ చైనా తయారు చేసిన HQ-9, HQ-16 గగనతల రక్షణ వ్యవస్థలను నమ్ముకుంటూ వచ్చింది. కానీ భారత డ్రోన్లు, క్షిపణుల దాడులకు ఈ వ్యవస్థలు ఏమాత్రం విరుగుడు కాకపోవడంతో, వాటిని పక్కనబెట్టి జర్మనీ తయారీ అధునాతన గగనతల రక్షణ వ్యవస్థపై దృష్టి పెట్టింది.
బ్రహ్మోస్ భయం – షరీఫ్ ఓపెన్ స్టేట్మెంట్
ఆపరేషన్ సిందూర్లో భారతదేశం బ్రహ్మోస్ క్షిపణులు ఉపయోగించిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా పేర్కొనడం గమనార్హం. దీనితో భారత దాడులు పూర్తిస్థాయిలో జరిగితే తట్టుకోలేమనే అనుభూతి పాకిస్థాన్లో విస్తృతంగా చెలామణి అవుతోంది.
జర్మనీ "IRIS-T SLM" వైపు ఆసక్తి
పాకిస్థాన్ ఇప్పుడు జర్మనీకి చెందిన “IRIS-T SLM” మిడ్-రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుపై దృష్టి పెట్టింది. ఇది ఒకేసారి 40 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను 360 డిగ్రీల కోణంలో ఛేదించగలగడం దీని ప్రత్యేకత. ఉక్రెయిన్ రష్యా క్షిపణుల దాడుల నుంచి రక్షించేందుకు ఇదే వ్యవస్థను వినియోగించడమే ఇందుకు ప్రేరణ.
కానీ ఎందుకింత కష్టం?
ఈ వ్యవస్థను తయారు చేస్తున్న డీల్ డిఫెన్స్ (Diehl Defence) కంపెనీ ఇప్పటికే భారతదేశంలో కీలక రక్షణ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్ అభివృద్ధి చేస్తున్న జలాంతర్గాములకు ఆయుధాల సరఫరాలో ఈ సంస్థ పాత్ర ఉంది. ఫలితంగా, భారత్ను విస్మరించి పాక్తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం లేనట్లేనని నిపుణులు భావిస్తున్నారు.
ఆర్థికంగా పాక్ ఎంత సిద్ధంగా ఉంది?
పాక్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఐఎంఎఫ్, ADB వద్ద నుంచి అప్పులపై ఆధారపడుతోంది. 45 శాతం జనాభా దారిద్ర్యరేఖకు దిగువన ఉండగా, భారీగా రక్షణ ఖర్చులు పెంచుతున్న పాక్ ప్రభుత్వంపై దేశీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.