భారత్కు అమెరికా సహాయం అవసరం లేదు- రూబియో
ఢిల్లీలో కారు పేలుడు ఘటనపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు.
భారత్కు అమెరికా సహాయం అవసరం లేదు- రూబియో
ఢిల్లీలో కారు పేలుడు ఘటనపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు. ఈ పేలుడును ఉగ్రవాద దాడిగా ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద ఘటన విషయంలో భారత్ అనుసరిస్తున్న దర్యాప్తును ప్రశంసించారు.
దర్యాప్తు విషయంలో భారత్కు అమెరికా సహాయం అవసరం లేదన్నారు. ఈ ఘటనపై ఇండియా దర్యాప్తు సంస్థలు చాలా క్షుణ్ణంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో వెల్లడించారు.