Mark Zuckerberg: కరోనా కట్టడికి జుకర్బర్గ్ భారీ విరాళం
కరోనా వైరస్ పై పోరాటానికి ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్గ్ జుకర్బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా చాన్ ముందుకు వచ్చారు.
కరోనా వైరస్ పై పోరాటానికి ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్గ్ జుకర్బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా చాన్ ముందుకు వచ్చారు.. వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మరణించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కరోనా వైరస్ కట్టడికి ప్రతిఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.. తమ వంతు సహాయంగా పరిశోధనలకు గాను 25 మిలియన్ డాలర్ల (రూ.187.19 కోట్లు) విరాళం ప్రకటించారు.
ఈ మొత్తాన్ని కరోనా వైరస్ పరిశోధనకు వినియోగించాలని సూచించారు. విరాళాన్ని చాన్ జుకర్బర్గ్ ఇనిషియేటివ్ (CZI) నుంచి అందించారు. ఈ సమయంలో మనకు పరిశోధకులే ముఖ్యమని చెప్పిన జుకర్ బర్గ్ వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని అందరికి పిలుపునిచ్చారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో 6 లక్షల మందికి పైగా మహమ్మారి భారిన పడ్డారు. 30 వేల మందికి పైగా మరణించారు. వైరస్ కు కేంద్రమైన చైనాలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో లక్షమందికి పైగా ఈ వైరస్ సోకింది.