లండన్లో భారత దౌత్య కార్యాయలంపై.. భారతజెండాను అగౌవరపరిచిన ఖలిస్థాన్ మద్దతుదారులు
London: బ్రిటన్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు
London: లండన్లో భారత జాతీయ జెండాకు అవమానం జరిగింది. భారత దౌత్య కార్యాలయంపై ఖలిస్థాన్ అనుకూలవాదులు భారత జెండాను ఎగురవేశారు. భారతీయ జెండాను అగౌరవపరచడంపై యూకే సీనియర్ దౌత్యవేత్తకు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చి..బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఖలిస్థాన్ వేర్పాటు వాదులు..లండన్లో చేసిన ఈ పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత్ తెలిపింది. వెంటనే అక్కడి ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేసింది.
కాగా ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ అనుచరులను పంజాబ్ పోలీసులు అరెస్టులు చేశారు. అమృత్పాల్ సింగ్ కోసం కూడా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు, మూడు రోజులుగా పంజాబ్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ప్రవాస సిక్కుల్లోని ఓ వర్గం లండన్లో నిరసనలు ప్రారంభించింది. లండన్లోని భారత హై కమిషన్ భవనంపై ఏర్పాటు చేసిన జెండాను కిందికి దించుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసింది. ఈ చర్యను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. నిరసనకారులు భారత హైకమిషన్ కార్యాలయానికి వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.