ట్రంప్ ప్రభత్వానికి ఉపశమనం.. భారత్ నుంచి అందిన క్లోరోక్విన్ మాత్రలు
భారత్ నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ సహా ఇతర ప్రాణాధార ఔషధాలు అమెరికాకు చేరాయి.
భారత్ నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ సహా ఇతర ప్రాణాధార ఔషధాలు అమెరికాకు చేరాయి. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈమందులు అన్ని ప్రత్యేక కార్గో విమానంలో న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రాయనికి శనివారం సాయంత్రం అమెరికాలోని భారత రాయబారి తరణ్జిత్ సంధు వెల్లడించారు. కరోనా చికిత్సలో క్లోరోక్విన్ మందులు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, వీటిని కరోనా రోగులు, వారికి దగ్గర ఉండేవారికి ఇవ్వొచ్చని 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్'(ఎఫ్డీఏ) సూచించిన సంగతి తెలిసిందే.
అమెరికాలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఆదివారం ఉదయం సమయానికి అమెరికాలో 5,33,259 మంది వైరస్ సోకగా.. వీరిలో 20,597 మంది మరణించారు. న్యూయార్క్ రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో రోగులకు చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ అమెరికాకు చేరడం ప్రభుత్వానికి ఉపశమనం కలిగిస్తుంది.
భారత్ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం విధించింది. కానీ, ప్రపంచ దేశాల నుంచి డిమాండ్ పెరగడంతో... ప్రధాని మోదీ మానవతా దృక్పథంలో వ్యహరించి నిషేదాన్ని ఎత్తివేశారు. భారత అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుకొని మిగిలిన 30 దేశాలకు ఎగుమతి చేస్తుంది.