కరోనా వైరస్ చికిత్సకు మరో ఔషధం.. అమెరికా అధికారికంగా అనుమతి
కరోనా వైరస్ చికిత్సలో యాంటీ వైరస్ డ్రగ్ రెమ్డెసివిర్ వాడేందుకు అమెరికా అధికారికంగా అనుమతులు ఇచ్చింది.
కరోనా వైరస్ చికిత్సలో యాంటీ వైరస్ డ్రగ్ రెమ్డెసివిర్ వాడేందుకు అమెరికా అధికారికంగా అనుమతులు ఇచ్చింది. ఔషధ నియంత్రణ సంస్థ 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' ఈ డ్రగ్ అత్యవసర వినియోగ అనుమతికి అంగీకరించింది. కోవిడ్19 నుంచి బాధితులను రక్షించేందుకు అనేక ఔషధాల్ని పరీక్షిస్తున్న క్రమంలో రెమ్డెసివిర్ మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఔషధాన్ని అమెరికాకు చెందిన 'గిలీడ్ సైన్సెస్' తయారు చేస్తోంది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గిలీడ్ సీఈఓతో కలిసి 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' ప్రకటించారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి విషమించిన పరిస్థితుల్లో రెమ్డెసివిర్ను ఇవ్వాలని ఎఫ్డీఏ సూచించింది. రెమ్డెసివిర్ తీసుకున్న రోగులు మిగతా మందులతో పోలిస్తే 31శాతం వేగంగా కోలుకున్నారని ఎఫ్డీఏ తెలిపింది. ఈ డ్రగ్ వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రయోగాల్లో తేలినప్పటికీ.. మరిన్ని ఆధారాలు సమర్పిస్తే పూర్తి స్థాయి వినియోగానికి అనుమతిస్తామనిఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది.