జపాన్ దీవులలో భూకంపం
జపాన్ లో భూకంపం సంభవించింది. ఒగాసవరా దీవులలోని పశ్చిమ తీరంలో శనివారం 6.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ (జెఎంఎ) తెలిపింది.
జపాన్ లో భూకంపం సంభవించింది. ఒగాసవరా దీవులలోని పశ్చిమ తీరంలో శనివారం 6.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ (జెఎంఎ) తెలిపింది. ఇది శనివారం ఒగాసవరా దీవులలో 490 కిలోమీటర్ల లోతులో సంభవించింది. అయితే సునామీ ప్రమాదం లేదని జెఎంఎ తెలిపింది, ఆస్తినష్టం , ప్రాణనష్టం గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. అయితే దీనిపై ఆరా తీసిన ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.