Indonesia: ఫుట్బాల్ గ్రౌండ్లో తొక్కిసలాట.. 127 మంది దుర్మరణం
Indonesia: సురబాయ జట్టు చేతిలో ఓడిపోయిన అరెమా జట్టు
Indonesia: ఫుట్బాల్ గ్రౌండ్లో తొక్కిసలాట.. 127 మంది దుర్మరణం
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తూర్పు జావా ప్రావిన్సులోని ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. అరేమా ఫుట్బాల్ క్లబ్, పెర్సెబయ సురబయ మధ్య గతరాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఇండోనేషియా పోలీసులు తెలిపారు. ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి దూసుకురావడంతో ఈ ఘటన జరిగింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది.
ఫుట్బాల్ మ్యాచ్ అనంతరం అభిమానులు మైదానంలోకి చొచ్చుకెళ్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. పోలీసు వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. ఈ మ్యాచ్లో పెర్సెబయ 3-2తో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన తొక్కిసలాటతో ఇండోనేషియాలోని ప్రముఖ లీగ్ అయిన బీఆర్ఐ లీగ్ 1.. వారం రోజులపాటు మ్యాచ్లను నిషేధించింది. మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటనపై ఫుట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియా విచారణకు ఆదేశించింది. ఇండోనేషియాలో ఇలాంటి ఘటనలు ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి.