మూత్రంలో రక్తం వస్తోందా? అయితే అది ఈ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావచ్చు!

మూత్రంలో రక్తం వస్తోందా? అయితే అది ఈ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావచ్చు!

Update: 2026-02-27 12:43 GMT

మూత్రంలో రక్తం వస్తోందా? అయితే అది ఈ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావచ్చు!

మీరు మూత్ర విసర్జన చేసేటప్పుడు రక్తం కనిపిస్తే.. అది కూడా రెండు మూడు రోజులుగా వరుసగా జరుగుతుంటే దానిని అస్సలు తేలికగా తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. దీనిని వైద్య పరిభాషలో 'హెమటూరియా' అని అంటారని చెబుతున్నారు. ఇది కిడ్నీలు, మూత్రనాళం లేదా మూత్రాశయంలో తలెత్తిన తీవ్రమైన సమస్యలకు ప్రాథమిక సంకేతం కావచ్చని వెల్లడించారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనిని ఎలా నివారించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మూత్రంలో రక్తం రావడానికి ప్రధాన కారణాలు..

*మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు, అవి మూత్రనాళాన్ని రాపిడికి గురిచేయడం వల్ల మూత్రంలో రక్తం వస్తుంది.

*మూత్రనాళంలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మూత్రాశయం వాపుకు గురై రక్తం పడే అవకాశం ఉంది.

*కొన్నిసార్లు ఇది కిడ్నీ వ్యాధులు లేదా మూత్రాశయానికి సంబంధించిన కణితుల వల్ల కూడా సంభవించవచ్చు.

ఈ క్రింది లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలని వైద్యులు చెబుతున్నారు..

*రక్తం పడటంతో పాటు మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట లేదా నొప్పి ఉండటం.

*నడుము భాగంలో లేదా పొత్తికడుపులో విపరీతమైన నొప్పి రావడం.

*తరచుగా రక్తం పడుతుంటే అది కిడ్నీ లేదా మూత్రాశయ క్యాన్సర్ లక్షణం కూడా అయ్యే ప్రమాదం ఉంది.

*ప్రారంభ దశలోనే దీనిని గుర్తిస్తే సమస్యను నయం చేయవచ్చని, నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి విషమించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మీ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్యులు పలు సూచనలు చేశారు. రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలని, ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు నియంత్రించాలని చెబుతున్నారు. షుగర్, బీపీలను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలని సూచించారు. ఎందుకంటే ఇవి కిడ్నీలపై నేరుగా ప్రభావం చూపుతాయని వెల్లడించారు. మూత్రంలో ఏమాత్రం తేడా కనిపించినా లేదా మంటగా అనిపించినా సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టరును సంప్రదించాలని అన్నారు. ఆరోగ్యం విషయంలో చిన్న మార్పు కనిపించినా అది పెద్ద ప్రమాదానికి హెచ్చరిక కావచ్చని, సరైన సమయంలో చికిత్స పొందితే ఆరోగ్య సమస్యల నుంచి సురక్షితంగా బయటపడవచ్చని చెప్పారు.

Tags:    

Similar News