ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. బ్రేక్ డ్యాన్స్ మిషన్ పై పోటో దిగుతూ..

Update: 2019-11-15 07:17 GMT

సెల్ఫీ మోజులో పడి యువత ప్రాణాలు కోల్పోతున్నారు. సరదగా గడుపుదామని ఇంటి నుంచి వెళ్తున్న యువకులు తల్లిదండ్రులకు క్షోభ మిగుల్చుతున్నారు. కొందరు బైక్ రైడింగ్ లు మరికొందరు నీటిలో ఈదుతూ సెల్పీలు దిగేందుకు ప్రయత్నించి ప్రాణం మీదుకు తెచ్చుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న జాతరకు వచ్చిన ఓ యువకుడు మొబైల్ లో ఫోటో తీసుకునేందుకు ప్రయత్నించి బ్రేక్ డ్యాన్స్ మిషన్ పై నుంచి కిందపడి మృత్యువాతపడ్డాడు.

నిజామాబాద్ జిల్లా భీంగల్ లోని లింబాద్రిగుట్టపై లక్ష్మీనర్సింహ స్వామి ఉత్సవాల సందర్భంగా జాతర జరుగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన జయరాజ్ అనే యువకుడు స్నేహితులతో సరదగా గడిపాడు. ఆ తర్వాత బ్రేక్ డ్యాన్స్ మిషన్ ఎక్కాడు. ఆ ఉత్సాహంలో సరదగా మొబైల్ లో సెల్పీ తీసుకోవాలనుకున్నాడు. బ్రేక్ డ్యాన్స్ మిషన్ నడుస్తుండగానే సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. మిషన్ వేగానికి చేతిలోని మొబల్ జారీపోవడంతో పాటు జయరాజ్ పట్టు తప్పాడు. మిషన్ మద్యలో ఇరుక్కుపోయాడు. గమనించిన వారు అప్రమత్తం అయ్యారు. వెంటనే మిషన్ ఆపించి జాగ్రత్తగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. 

Tags:    

Similar News