రూ.1.30 లక్షలకు గిరిజన మహిళ అమ్మకం!

Update: 2019-08-10 09:02 GMT

కొమ్రం భీమ్ జిల్లాలో మహిళ అమ్మకం కలకలం రేపింది. తిర్యాని ‌మండలం దంతన్ పల్లికి చెందిన గిరిజన మహిళని మధ్యప్రదేశ్ కు చెందిన బ్రోకర్లు ఒక లక్ష 30 వేలకు విక్రయించారు. ఈ వ్యవహారంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కీలకపాత్ర పోషించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన బ్రోకర్ కోసం గాలిస్తున్నారు. గత జూలైలో తన కూతురు కనిపించడం లేదని ఆ మహిళ తండ్రి తిర్యాణి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో మహిళా విక్రయం వెలుగులోకి వచ్చింది. దళారుల చేతిలో మోసపోయి ప్రాంతం కానీ ప్రాుతంలో ఇతరుల చేతిలో చిక్కిన ఆ మహిళ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు అంతా చెప్పడంతో మరిన్ని విషయాలు తెలిశాయి. దీంతో జిల్లాలో మానవ అక్రమ రవాణా బయటకు తెలిసింది.  

Tags:    

Similar News