దారుణం: కులాంతర వివాహం చేసుకుందని..

Update: 2019-06-28 14:54 GMT

కులాంతర వివాహం చేసుకుందంటూ పరువు కోసం కన్నకూతూరిని కడతేర్చారు కసాయి తల్లిదండ్రులు. పచ్చిబాలింత అని కూడా చూడకుండా కూతుర్ని దారుణంగా చంపి బావిలో పడేశారు. చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘటన తీవ్రకలకలం రేపుతోంది.

చిత్తూరు జిల్లాలో ఘోర అమానుష ఘటన చోటు చేసుకుంది. కన్నకూతుర్ని పరువు హత్య చేశారు. పలమనేరు మండలం ఊసరపెంటకు చెందిన హేమవతి కేశవులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రెండున్నరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే గ్రామంలో కులపెద్దలు తల్లిదండ్రుల నుంచి భయం ఉండటంతో ఊరొదిలి వెళ్లిపోయారు. వేరే ఊళ్లో తలదాచుకున్నారు. వారం రోజుల క్రితం హేమవతి మగబిడ్డకు జన్మనిచ్చింది.

భార్యా, బిడ్డను ఆసుత్రి నుంచి ఆటోలో తీసుకువస్తున్నకేశవులును హేమవతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా కేశవులును తీవ్రంగా కొట్టి కూతురు హేమవతిని బలవంతంగా పక్కనే ఉన్న పొలంలోకి లాక్కెళ్లారు. పచ్చిబాలింత అని కూడా చూడకుండా కన్నకూతూర్నిచంపి పక్కనే ఉన్న బావిలో పడేశారు. ఏడురోజుల పసికందును అనాథను చేశారు. పరువు హత్య ఘటనతో కేశవులు కుటుంబ సభ్యులు హేమవతి తల్లిదండ్రుల ఇంటిపై దాడి చేశారు. ద్విచక్ర వాహనాన్ని కాల్చి ఇంటిని ధ్వంసం చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేశవుల కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.   

Tags:    

Similar News