హైదరాబాద్ బోయిన్పల్లిలో దారుణం జరిగింది. భర్త క్షేమం కోసం నిరంతరం పాటు పడే భార్యే నరహంతకిగా మారిన ఘటన చోటు చేసుకుంది. స్ధానికంగా నివసించే బాబాఖాన్ అనే యువకుడిని భార్య తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపింది. నిన్న అర్ధరాత్రి భర్తను చంపిన ఆమె ఉదయం ఎవరికి అనుమానం రాకుండా అంత్యక్రియలు నిర్వహించింది. అనుమానం వచ్చిన పోలీసులు తనదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. తన భర్తను గొంతునులిమి చంపినట్టు భార్య అంగీకరించింది. ఇందుకు భార్య ప్రియుడితో పాటు మరో ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.