భీమవరంలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య

Update: 2019-12-12 07:45 GMT

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భర్తను హత్య చేసింది ఓ భార్య. భర్త సత్యశర్మ వేధింపులు తట్టుకోలేక అతడి గొంతు నులిమి అతని భర్య హేమ నాగమణి చంపేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. హేమనాగమణి కాళ్ళకూరులో నర్స్‌గా పనిచేస్తుండగా భర్త సత్యశర్మ ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాడు. భార్యపై అనుమానంతో తరచు వేధిస్తున్నాడు. భార్య భర్తల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. భర్త వేధింపులు తట్టుకోలేక సత్యశర్మ గొంతున నులిమి చంపింది నాగమణి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Tags:    

Similar News