శ్రీకాళహస్తిలో క్షుద్రపూజల కలకలం

Update: 2019-11-27 07:45 GMT
శ్రీకాళహస్తి

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కలకలం రేగింది. ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కొందరు వ్యక్తులు అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేశారు. ఈ క్షుద్రపూజలకు శ్రీకాళహస్తి ఆలయ ఏఈఓ ధనపాల్ సహకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. క్షుద్ర పూజలు చేసిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తి ఆలయ ఏఈఓ ధనపాల్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News