మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. వీరి బాగోతం చూసిన భార్య ఏం చేసిందంటే..

Update: 2019-07-25 04:58 GMT

వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను, ప్రియురాలిని భార్య చితకబాదింది. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బంధువులతో కలిసి ఉతికి ఆరేసింది. హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలోని ప్రగతి నగర్ లో ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే కొత్త కొమ్ముగూడెం ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ కు సౌజన్య కు వివాహం జరిగింది.పెళ్లైన కొద్దిరోజుల తర్వాత భార్యను వదిలి పెట్టిన లక్ష్మణ్ కొంతకాలంగా కూకట్పల్లిలోని ప్రగతినగర్లో అనూష అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు.

దీనిపైన భార్య విడాకులు ఇవ్వమని తనకు ఆశ్రయం కల్పించ మనీ భర్త కాళ్లపైన పడింది.అయినా కూడా పట్టించుకోకుండా విడాకులు ఇవ్వకుండా అనూషా దగ్గరే ఉంటూ సౌజన్య పిల్లలను వదిలి పెట్టాడు.దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న సౌజన్య తన బంధువులతో తెల్లవారుజామున ప్రగతి నగర్ వచ్చి లక్ష్మణ్ అనూష లను చితకబాది పోలీసులకు అప్పగించింది.

Tags:    

Similar News