ఇంట్లో ప్రియుడితో పట్టుబడ్డ భార్య.. భర్త ఆగ్రహంతో..
వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను ప్రియుడితో కలిసి ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు భర్త! ఇద్దరిపైనా పెట్రోలు పోసి.. నిప్పంటించాడు! మంటల్లో చిక్కుకొని ఆమె మృతిచెందింది. ఆమె ప్రియుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన చేవెళ్లలో ఆదివారం ఉదయం జరిగింది.
వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను ప్రియుడితో కలిసి ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు భర్త! ఇద్దరిపైనా పెట్రోలు పోసి.. నిప్పంటించాడు! మంటల్లో చిక్కుకొని ఆమె మృతిచెందింది. ఆమె ప్రియుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన చేవెళ్లలో ఆదివారం ఉదయం జరిగింది. చేవెళ్ల అంబేడ్కర్ కాలనీకి చెందిన భాగ్యలక్షి(25)కి కొన్నేళ్ల క్రితం మండల పరిధిలోని దామరిగిద్ద గ్రామానికి చెందిన రవితో వివాహం జరిగింది. భార్యాభర్తలు బతుకుదెరువు కోసం అంబేడ్కర్ కాలనీలోనే ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భాగ్యలక్ష్మి కొద్దిరోజుల నుంచి స్థానికంగా ఉండే ఉమర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. ఈ విషయం తెలిసిన రవి భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినా పద్ధతి మార్చుకోని భాగ్యలక్ష్మి అక్రమ సంబంధాన్ని కొనసాగుతూ వస్తోంది. శనివారం రాత్రి భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించుకుని ఏకాంతంగా గడపసాగింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన రవి వారిద్దరినీ చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే బైక్లోని పెట్రోల్ తీసి వారిద్దరిపై చల్లి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో భాగ్యలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఉమర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.