వివేకా హత్య కేసులో ముగిసిన పిటిషనర్ల వాదనలు

Update: 2019-03-28 08:29 GMT

వైఎస్ వివేకానంద హత్య కేసులో పిటిషనర్ల తరపు వాదనలు ముగిసాయి. ఈ సందర్భంగా కేసుని సీబీఐకి ఇవ్వాలని జగన్, సౌభాగ్యమ్మ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. కేసు విచారిస్తున్న సిట్ ప్రెస్ మీట్లు పెట్టకుండా ఆదేశించాలని న్యాయవాదులు కోర్టును కోరారు. వివేకా హత్యను టీడీపీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం తరపు న్యాయవాదులు మధ్యాహ్నం వాదనలు వినిపించనున్నారు. 

Similar News