మసాజ్ సెంటర్‌లో ప‌రిచ‌యాలు..వారే ఆమె టార్గెట్..కిలాడీ లేడీ గుట్టుర‌ట్టు

Vijayawada: విజయవాడలో కిలాడీ లేడీని అరెస్ట్ చేసిన పోలీసులు

Update: 2021-05-27 12:51 GMT

నేరం ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Vijayawada: స‌మాజంలో ప్ర‌తి రోజు ఎక్క‌డో ఒక చోట నేరాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువతీయువ‌కుల‌ను టార్గెట్ చేసుకుని నేర‌గాళ్లు పేట్రేగిపోతున్నారు. అమాయకుల అవస‌రాల‌ను తెలుసుకొని వారిని ఎదో విధంగా ప్ర‌లోభాలు పెట్టి అందిన‌కాడికి దండుకుంటున్నారు మోస‌గాళ్లు. మారో చోట ఆమాయ‌క యువ‌తుల‌ను టార్గెట్ చేసి వారిని వ్య‌భిచారకూపంలోకి దింపుతున్నారు. ఇలా నిత్యం ఏదో ఒక చోట నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. నేరాల‌కు పాల్ప‌డుతున్న వారిని పోలీసులు చాక‌చ‌క్యంతో ప‌ట్టుకుంటున్నారు. కేటుగాళ్లకు త‌గిన బుద్ది చెబుతున్నారు. ఉస‌లు లెక్క‌బెట్టిస్తున్నారు పోలీసులు. తాజాగా నిరుద్యోగుల‌ను ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని చెప్పి వారి నుంచి డ‌బ్బులు దండుకొని బురిడీ కొట్టించిన ఓ మాయ లేడి ఆట‌క‌ట్టించారు ఏపీ పోలీసులు. ఎవ‌రా మాయ లేడి ఎంటా క‌థ అనే తెలుసుకుందాం.

పూర్తి వివ‌రాళ్లోకి వెళ్తే.. నిరుద్యోగులు, డబ్బుకు వెనకాడని వారిని టార్గెట్‌గా చేసుకుని.. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన మహిళాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పంచకర్మలో మసాజ్ సెంటర్‌లో పని చేసే సమయంలో రమాదేవి.. కొంతమంది పరిచయంతో నిరుద్యోగులను, మహిళలను టార్గెట్‌ చేసుకుని నమ్మించి మోసం చేస్తుండేది. వారి దగ్గరి నుంచి డబ్బులు తీసుకుని తీసుకున్న డబ్బులు చెల్లించామని అడిగితే బెదిరింపులకు దిగేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దాంతో బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రమాదేవి బండారం బయటపడింది. ఇంతకుముందే రమాదేవిపై విజయవాడ పరిధిలోని రెండు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి.

Tags:    

Similar News