నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో కలకలం రేగింది. టీకాలు వికటించిన ఘటనలో ఐదు నెలల చిన్నారి మృతిచెందగా 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది చిన్నారులను నాంపల్లి నుండి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నొప్పికి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్లు కాకుండా వేరే మందులు ఇవ్వడంతోనే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ అనంతరం జ్వరం రాకుండా ఇవ్వాల్సిన మాత్రలు వేరేవి ఇవ్వడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా అసలు వ్యాక్సిన్ వేయడం వల్లే ఇలా జరిగిందా?లేక మాత్రల వల్ల జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నీలోఫర్లో 15 మంది చికిత్స పొందుతున్నారు.