అర్ధరాత్రి ఇంట్లో చొరబడి..ఉపాధ్యాయుడి దారుణ హత్య

Update: 2020-02-10 09:19 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిని గొంతు కోసి హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో భార్య, పిల్లలతో నిద్రిస్తున్న కారం రామకృష్ణని దారుణంగా హత్య చేశారు. రామకృష్ణ దుమ్ముగూడెంలోని పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గతంలో ఉన్న భూవివాదం కారణంగా తన భర్తను హత్య చేశారని భార్య తులసి ఆరోపిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News