దారుణం : పోలీసులమంటూ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం

Update: 2020-02-12 06:16 GMT

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బీదర్ నుంచి సూర్యాపేట వెళ్తున్న బస్సులో ఓ మహిళపై ఇద్దరు యువకులు దౌర్జన్యం చేశారు. బస్సులో నుంచి దింపేసి అత్యాచారానికి ఒడిగట్టారు.

జహీరాబాద్‌ మండలం పస్తాపూర్‌ దగ్గర ఇద్దరు దుండగులు పోలీసులమని చెప్పి గుట్కా ప్యాకేట్లు తరలిస్తున్నావని, తనిఖీ చేయాలంటూ సదరు మహిళను బస్సు నుంచి దింపేశారు. పస్తాపూర్ గ్రామంలోని ఏసీబీ బ్యాంక్ వెనకవైపు తీసుకెళ్లిన మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె దగ్గరున్న గుట్కా ప్యాకేట్లతో దుండగులు పరారయ్యారు. బస్సుతో పాటు యువకుల దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. 


Full View


Tags:    

Similar News