కోడిపందెం శిబిరంపై పోలీసుల దాడి.. ఇద్దరు మృతి

కృష్ణాజిల్లా చిత్తపూరులో కోడిపందాలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.

Update: 2019-01-11 06:37 GMT
krishna district

కృష్ణాజిల్లా చిత్తపూరులో కోడిపందాలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. కోడిపందాలపై పోలీసులు దాడి చేయడంతో పందెంరాయుళ్లు, స్థానికులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులను చూసి పరుగులు తీసిన ఇద్దరు వ్యక్తులు బావిలో పడి మృతి చెందారు. మృతులను చిట్టూరి శ్రీనివాసరావు, కుక్కల చెన్నకేశ్వరరావు గా గుర్తించారు. పండుగ రోజుల్లో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మృతదేహాలతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

Similar News