పురుగుల మందు తాగిన గిరిజన వృద్ధులు

Update: 2019-08-17 15:25 GMT

కుటుంబ కలహాల నేపథ్యంలో గుండాల మండలం నర్సాపురం తండా.. రోళ్లగడ్డకు చెందిన దామిని, సాలి అనే గిరిజన వృద్ధ మహిళలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే బాధితురాలిని ఆసుపత్రికి తరలించే క్రమంలో మల్లన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. బాధితురాలిని బుజాన వేసుకొని వాగు దాటి ఆసుపత్రికి తరలించారు.. అయితే అప్పటికే వృద్ధురాలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోకరిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. 

Tags:    

Similar News