కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలినడకన శ్రీశైలం వెళుతున్న కర్ణాటక భక్తులపైకి కర్నూలు-బళ్లారి రహదారిపై ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతులంతా కర్ణాటకలోని ఎర్రగుడి వాసులుగా గుర్తించారు. మృతులు పోతులింగా, సేతు, మల్లయ్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.