రాజాంలో దారుణం.. 10వ తరగతి విద్యార్థినిపై పోకిరీల దాడి !

Update: 2020-02-10 06:56 GMT
రాజాంలో దారుణం

శ్రీకాకుళం జిల్లా రాజాంలో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థినిపై పోకిరీలు దాడి చేశారు. బ్లేడ్‌తో విద్యార్థినిపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. డోలపేటలోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయాన్నంతా స్కూల్‌ యాజమాన్యం గోప్యంగా ఉంచుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెపై దాడి అనుకోకుండా జరిగిందా? లేక ఎవరైనా పథకం ప్రకారమే చేశారా? అని విచారిస్తున్నారు.

Tags:    

Similar News