వినయశ్రీ కోసం స్నేహితుల కన్నీళ్లు

ప్రముఖ‌ వ్యాపారవేత్త సత్యనారాయణ రెడ్డి కుటుంబం కొన్ని రోజుల క్రితం కాకతీయ కాలువలో పడి మృతి చెందింది.

Update: 2020-02-18 13:31 GMT

ప్రముఖ‌ వ్యాపారవేత్త సత్యనారాయణ రెడ్డి కుటుంబం కొన్ని రోజుల క్రితం కాకతీయ కాలువలో పడి మృతి చెందింది. సత్యనారాయణ రెడ్డి కుమార్తె వినయశ్రీ చదువుతున్న డెంటల్‌ కాలేజీ విద్యార్ధులు ఈ వార్త విని షాక్‌ చెందారు. అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఆమెను తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. నిజామాబాద్‌లో డెంటల్ కళాశాలలో వినయశ్రీ సంతాప సభ నిర్వహించారు.

తోటి విద్యార్ధులు వినయశ్రీ చిత్ర పటానికి పులా మాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. తమతో ఎంతో ఆప్యాయంగా ఉండే వినయశ్రీ చనిపోవడంతో వీరంతా కన్నీటి పర్యంతమయ్యారు. వినయశ్రీ చదివిన తరగతి గదిలో సంతాప సభ ఏర్పాటు చేయడంతో తోటి స్నేహితులు వినయశ్రీ ని తలచుకుని ఆమె జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. వినయశ్రీ మృతి జీర్ణించుకోలేక పోతున్నామని ఆమె స్నేహితులు విలపించారు.

Tags:    

Similar News