టీడీపీ నేతను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు

Update: 2019-12-17 08:50 GMT
సుబ్బారావు

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు పడగవిప్పాయి. టీడీపీ నేత సుబ్బారావును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. సుబ్బారావును కాపుకాసిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికిచంపారు. రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు ఒక్కసారిగా ఆయనపైకి తెగబడి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం బెలూంగుహాల దగ్గర చోటుచేసుకుంది. సుబ్బారావు స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె. ఈయన బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు అని తెలిసింది.

Tags:    

Similar News