ఔటర్ పై కాల్పుల కలకలం

Update: 2019-07-04 11:08 GMT

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద కాల్పులు కలకలం రేపాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ వద్ద రింగ్ రోడ్డుపై కాల్పుల శబ్దం విన్న స్థానికులు మొదట గ్యాంగ్ వార్ అనుకున్నారు. కొద్ది సేపటి తరువాత కాల్పులు వినిపించిన ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ కారు వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడివున్నాడు. అతడిని వెంటనే..ఆసుపత్రికి తరలించారు.

కారులో లభించిన వివరాల ప్రకారం ఆవ్యక్తి పేరు అశ్విన్ జైన్. తన బెంజ్ కారులో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నట్టు భావిస్తున్నారు. అయితే, ఈ సంఘటనపై పలు అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. జైన్ కు వంటి మీద గాయం కనిపించింది. ఆత్మహత్య చేసుకునే వారు సాధారణంగా తుపాకీ తలకు గురిపెట్టుకుని కాల్చుకుంటారు. కానీ, జైన్ గాయం అలా ఉండకపోవడంతో కారులో మరెవరైనా ఉన్నారా అనే సందేహం వ్యక్తం అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Tags:    

Similar News